గల్ఫ్ కార్మికుల మానవత్వం
- January 12, 2026
తెలంగాణ: తెలంగాణలోని మండలంలోని వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం సేవాభావాన్ని మరోసారి చాటింది. వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు,వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించి తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన పాముల గంగాధర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పెనుకుల అశోక్ మాట్లాడుతూ,సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కార్మిక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు కలిపి సుమారు 50 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.కన్న ఊరి అభివృద్ధి కోసం గల్ఫ్ కార్మికులు తమ నెల జీతంలో భాగం సహాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కార్మికుల హక్కులు, గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరెల్లి మహేష్, నలిమేలా ప్రసాద్,బి.ఎల్.నారాయణ గౌడ్,పోతు రఘు,మెండే ప్రవీణ్,మాచర్ల ఆది రెడ్డి,అన్నవరం రవితేజ,కండల వెంకటి,కనుమల విశాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









