గల్ఫ్ కార్మికుల మానవత్వం
- January 12, 2026
తెలంగాణ: తెలంగాణలోని మండలంలోని వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం సేవాభావాన్ని మరోసారి చాటింది. వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు,వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించి తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన పాముల గంగాధర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పెనుకుల అశోక్ మాట్లాడుతూ,సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కార్మిక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు కలిపి సుమారు 50 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.కన్న ఊరి అభివృద్ధి కోసం గల్ఫ్ కార్మికులు తమ నెల జీతంలో భాగం సహాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కార్మికుల హక్కులు, గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరెల్లి మహేష్, నలిమేలా ప్రసాద్,బి.ఎల్.నారాయణ గౌడ్,పోతు రఘు,మెండే ప్రవీణ్,మాచర్ల ఆది రెడ్డి,అన్నవరం రవితేజ,కండల వెంకటి,కనుమల విశాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







