గల్ఫ్ కార్మికుల మానవత్వం
- January 12, 2026
తెలంగాణ: తెలంగాణలోని మండలంలోని వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం సేవాభావాన్ని మరోసారి చాటింది. వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు,వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించి తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన పాముల గంగాధర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పెనుకుల అశోక్ మాట్లాడుతూ,సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కార్మిక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు కలిపి సుమారు 50 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.కన్న ఊరి అభివృద్ధి కోసం గల్ఫ్ కార్మికులు తమ నెల జీతంలో భాగం సహాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కార్మికుల హక్కులు, గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరెల్లి మహేష్, నలిమేలా ప్రసాద్,బి.ఎల్.నారాయణ గౌడ్,పోతు రఘు,మెండే ప్రవీణ్,మాచర్ల ఆది రెడ్డి,అన్నవరం రవితేజ,కండల వెంకటి,కనుమల విశాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









