గల్ఫ్ కార్మికుల మానవత్వం
- January 12, 2026
తెలంగాణ: తెలంగాణలోని మండలంలోని వి.వి.రావుపేట్ గల్ఫ్ సంఘం సేవాభావాన్ని మరోసారి చాటింది. వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు,వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించి తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన పాముల గంగాధర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పెనుకుల అశోక్ మాట్లాడుతూ,సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కార్మిక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు కలిపి సుమారు 50 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.కన్న ఊరి అభివృద్ధి కోసం గల్ఫ్ కార్మికులు తమ నెల జీతంలో భాగం సహాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కార్మికుల హక్కులు, గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరెల్లి మహేష్, నలిమేలా ప్రసాద్,బి.ఎల్.నారాయణ గౌడ్,పోతు రఘు,మెండే ప్రవీణ్,మాచర్ల ఆది రెడ్డి,అన్నవరం రవితేజ,కండల వెంకటి,కనుమల విశాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









