విజయవాడలో ఫేక్ ఇంటర్వ్యూలు
- January 30, 2019
విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో ఉద్యోగానికి రూ. 8లక్షలకు బేరం పెట్టారు ముంబైకి చెందిన ముగ్గురు మోసగాళ్లు.
బెజవాడలోని ఒక ప్రముఖ హోటల్లో ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఉద్యోగం వచ్చినట్టే అంటూ డబ్బులు వసూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ ముఠా చేతిలో మోసపోయిన విజయవాడకు చెందిన చిరంజీవి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్పై దాడి చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు బేరం పెట్టిన ముఠా ఇప్పటికే పలువురు నుంచి ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్ కింద రూ. 2లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిని ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్గా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?