విజయవాడలో ఫేక్ ఇంటర్వ్యూలు
- January 30, 2019
విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో ఉద్యోగానికి రూ. 8లక్షలకు బేరం పెట్టారు ముంబైకి చెందిన ముగ్గురు మోసగాళ్లు.
బెజవాడలోని ఒక ప్రముఖ హోటల్లో ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఉద్యోగం వచ్చినట్టే అంటూ డబ్బులు వసూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ ముఠా చేతిలో మోసపోయిన విజయవాడకు చెందిన చిరంజీవి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్పై దాడి చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు బేరం పెట్టిన ముఠా ఇప్పటికే పలువురు నుంచి ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్ కింద రూ. 2లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిని ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్గా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







