విజయవాడలో ఫేక్ ఇంటర్వ్యూలు
- January 30, 2019
విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో ఉద్యోగానికి రూ. 8లక్షలకు బేరం పెట్టారు ముంబైకి చెందిన ముగ్గురు మోసగాళ్లు.
బెజవాడలోని ఒక ప్రముఖ హోటల్లో ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఉద్యోగం వచ్చినట్టే అంటూ డబ్బులు వసూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ ముఠా చేతిలో మోసపోయిన విజయవాడకు చెందిన చిరంజీవి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్పై దాడి చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు బేరం పెట్టిన ముఠా ఇప్పటికే పలువురు నుంచి ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్ కింద రూ. 2లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిని ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్గా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







