విజయవాడలో ఫేక్ ఇంటర్వ్యూలు
- January 30, 2019
విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో ఉద్యోగానికి రూ. 8లక్షలకు బేరం పెట్టారు ముంబైకి చెందిన ముగ్గురు మోసగాళ్లు.
బెజవాడలోని ఒక ప్రముఖ హోటల్లో ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఉద్యోగం వచ్చినట్టే అంటూ డబ్బులు వసూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ ముఠా చేతిలో మోసపోయిన విజయవాడకు చెందిన చిరంజీవి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్పై దాడి చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు బేరం పెట్టిన ముఠా ఇప్పటికే పలువురు నుంచి ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్ కింద రూ. 2లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిని ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్గా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







