అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ వచ్చాడు: యూఏఈ దౌత్యవేత్త
- January 30, 2019
అగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు ఇండియాలో యూఏఈ దౌత్యవేత్త అహ్మద్ అల్ బన్నా. ఢిల్లీ-అబుదాభి ల మధ్య ఉన్న మంచి స్నేహంతోనే క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు అప్పగించగలిగామని అహ్మద్ తెలిపారు.
ఇరు దేశాల మద్య వ్యూహాత్మక బంధం బలపడటంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఒక ఏడాదిలోనో లేక ఒక్కరోజులోనో జరిగిపోవని చెప్పారు. గతేడాది డిసెంబరులో మైఖేల్ను యూఏఈ నుంచి భారత్కు రప్పించడం జరిగింది. అగస్టా వెస్ట్లాండ్ కేసును సీబీఐ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్లు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి యూఏఈ భారత్ల మధ్య క్విడ్ప్రొకో వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి.
యూఏఈ ప్రధాని షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్టూమ్ కుమార్తె యువరాణి లతీఫాను గతేడాది మార్చిలో భారత్లోకి ప్రవేశించడంతో ఆమెను పట్టుకుని తిరిగి అబుదాబికి అప్పగించింది భారత్. అయితే భారత అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. అదే సమయంలో యూఏఈ కూడా భారత్ అబుదాబిల మధ్య బంధాలు బలపడ్డాయి. ఇలా మరే దేశంతోను అబుదాబి ఇంతటి మంచి సంబంధాలు కొనసాగించలేదు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







