కత్తితో బెదిరించి 15,00 కువైటీ దినార్స్ దోపిడీ
- February 09, 2019
కువైట్ సిటీ: ప్రైవేట్ మనీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కత్తితో బెదిరించి, వారి నుంచి 15,000 కువైటీ దినార్స్ దోచుకున్న ఈజిప్టియన్ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫర్వానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంస్థ తరఫున డబ్బుని ఓ చోట నుంచి మరో చోటకి వాహనంలో తరలించేందుకు బాధిత ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా, కత్తితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడికి యత్నించి, డబ్బు కలిగిన బ్యాగ్ని తీసుకుని పారిపోయాడు. పారిపోతున్న అతన్ని పట్టుకునేందుకు బాధిత ఉద్యోగులు పరుగులు పెట్టారు. మరోపక్క సెక్యూరిటీమెన్ అలర్ట్ అవడంతో, నిందితుడ్ని పట్టుకోగలిగారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







