కత్తితో బెదిరించి 15,00 కువైటీ దినార్స్ దోపిడీ
- February 09, 2019
కువైట్ సిటీ: ప్రైవేట్ మనీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కత్తితో బెదిరించి, వారి నుంచి 15,000 కువైటీ దినార్స్ దోచుకున్న ఈజిప్టియన్ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫర్వానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంస్థ తరఫున డబ్బుని ఓ చోట నుంచి మరో చోటకి వాహనంలో తరలించేందుకు బాధిత ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా, కత్తితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడికి యత్నించి, డబ్బు కలిగిన బ్యాగ్ని తీసుకుని పారిపోయాడు. పారిపోతున్న అతన్ని పట్టుకునేందుకు బాధిత ఉద్యోగులు పరుగులు పెట్టారు. మరోపక్క సెక్యూరిటీమెన్ అలర్ట్ అవడంతో, నిందితుడ్ని పట్టుకోగలిగారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







