కత్తితో బెదిరించి 15,00 కువైటీ దినార్స్ దోపిడీ
- February 09, 2019
కువైట్ సిటీ: ప్రైవేట్ మనీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కత్తితో బెదిరించి, వారి నుంచి 15,000 కువైటీ దినార్స్ దోచుకున్న ఈజిప్టియన్ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫర్వానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంస్థ తరఫున డబ్బుని ఓ చోట నుంచి మరో చోటకి వాహనంలో తరలించేందుకు బాధిత ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా, కత్తితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడికి యత్నించి, డబ్బు కలిగిన బ్యాగ్ని తీసుకుని పారిపోయాడు. పారిపోతున్న అతన్ని పట్టుకునేందుకు బాధిత ఉద్యోగులు పరుగులు పెట్టారు. మరోపక్క సెక్యూరిటీమెన్ అలర్ట్ అవడంతో, నిందితుడ్ని పట్టుకోగలిగారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..