సోషల్ మీడియాలో డిఫేమ్ చేస్తే 250,000 దిర్హామ్ల జరీమానా, జైలు
- February 12, 2019
ఎవరైనా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా, వారి ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడ్తాయి. ఆర్టికల్373 - ఫెడరల్ చట్టం 3, 1987 ప్రకారం ఈ చర్య నేరపూరితం. 10,000 దిర్హామ్ల జరీమానా, ఏడాది వరకు జైలు శిక్ష, ఉల్లంఘనులకు పడే అవకాశం వుంటుంది. బాధిత వ్యక్తి గనుక పబ్లిక్ అఫీషియల్ అయితే, ఈ చర్యలు మరింత కఠినంగా వుంటాయి. నిందితుడికి 20,000 దిర్హామ్ల జరీమానా, 2 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించవచ్చని చట్టం పేర్కొంటోంది. 'నిందారోపణలు - దూషణలు) న్యూస్ పేపర్ లేదా ప్రింట్ మీడియాలో ప్రచురితమైతే అగ్రావేటెడ్ కేస్గా పరిగణించబడ్తుంది. కంప్యూటర్ నెట్ వర్క్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దూషణలకు దిగితే మాత్రం 250,000 దిర్హామ్ల వరకు నిందితులు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జరీమానా 500,000 వరకూ చేరుకునే అవకాశం వుంటుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వుంటుంది.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







