బాలీవుడ్ని సౌదీకి తీసుకొస్తున్నారు
- February 22, 2019
జెడ్డా: ఇండియన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కుదురుచకున్న ఒప్పందాల నేపథ్యంలో జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. రానున్న రోజుల్లో సౌదీ అరేబియాలో పలు ఈవెంట్స్ని నిర్వహించనున్నామనీ, వీటిలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటారని అధికారులు తెలిపారు. సౌదీ - భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని వారు చెప్పారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్, భారతదేశంలో పర్యటించిన సందర్బంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. తొలి రోజు పర్యటనలో ఇరు దేశాలకు చెందిన 400 మంది అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. 'ఇన్వెస్ట్ ఇన్ సౌదీ అరేబియా' పేరుతో ఓ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. పలు సౌదీ కంపెనీలు, తమ సేవల్ని ఇక్కడ షోకేస్ చేశాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







