బాలీవుడ్ని సౌదీకి తీసుకొస్తున్నారు
- February 22, 2019
జెడ్డా: ఇండియన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కుదురుచకున్న ఒప్పందాల నేపథ్యంలో జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. రానున్న రోజుల్లో సౌదీ అరేబియాలో పలు ఈవెంట్స్ని నిర్వహించనున్నామనీ, వీటిలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటారని అధికారులు తెలిపారు. సౌదీ - భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని వారు చెప్పారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్, భారతదేశంలో పర్యటించిన సందర్బంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. తొలి రోజు పర్యటనలో ఇరు దేశాలకు చెందిన 400 మంది అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. 'ఇన్వెస్ట్ ఇన్ సౌదీ అరేబియా' పేరుతో ఓ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. పలు సౌదీ కంపెనీలు, తమ సేవల్ని ఇక్కడ షోకేస్ చేశాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









