బాలీవుడ్ని సౌదీకి తీసుకొస్తున్నారు
- February 22, 2019జెడ్డా: ఇండియన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలతో కుదురుచకున్న ఒప్పందాల నేపథ్యంలో జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. రానున్న రోజుల్లో సౌదీ అరేబియాలో పలు ఈవెంట్స్ని నిర్వహించనున్నామనీ, వీటిలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటారని అధికారులు తెలిపారు. సౌదీ - భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని వారు చెప్పారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్, భారతదేశంలో పర్యటించిన సందర్బంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. తొలి రోజు పర్యటనలో ఇరు దేశాలకు చెందిన 400 మంది అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. 'ఇన్వెస్ట్ ఇన్ సౌదీ అరేబియా' పేరుతో ఓ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. పలు సౌదీ కంపెనీలు, తమ సేవల్ని ఇక్కడ షోకేస్ చేశాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు