కొనసాగుతున్న ‘మా’ ఎన్నికలు..
- March 10, 2019
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొనసాగుతున్నాయి.. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై నరేష్ పోటీకి దిగారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకల్లా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అసోసియేషన్ లో మొత్తం 800 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇప్పటికే నరేష్ , శివాజీరాజా, జీవిత రాజశేఖర్ దంపతులు, సాయిధరమ్ తేజ్ , పృథ్వి , జేడీ చక్రవర్తి, హీరోయిన్ రవళి , పరుచూరి గోపాల కృష్ణ, ఉత్తేజ్ , నాగిరెడ్డి, కృష్ణుడు, కరాటే కళ్యాణి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







