వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- June 20, 2026
యూఏఈ: వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో, ఫుజైరా ఎమిరేట్ వ్యాప్తంగా ఎయిర్ కండిషనింగ్ యూనిట్ల వాడకం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్ ఓవర్లోడ్లపై నివాసితులకు ఎమిరేట్ సివిల్ డిఫెన్స్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఎమిరేట్లో సంభవించే మొత్తం అగ్నిప్రమాదాలలో సుమారు 70 శాతం గృహ సంబంధితమైనవేనని గణాంకాలు వెల్లడిస్తున్న తరుణంలో ఈ భద్రతా హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఫుజైరా స్టాటిస్టిక్స్ సెంటర్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది కాలంలో అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య 60 శాతం తగ్గిందని, మరణాలు సున్నాగా నమోదయ్యాయి.
అయితే, వేసవి కాలంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నప్పుడు, నివాసితులు తమ ఏసీ సిస్టమ్లకు సర్వీసింగ్ చేయించకుండా, గృహ పవర్ బోర్డులను ఓవర్లోడ్ చేయడం కొనసాగిస్తే, త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని అత్యవసర సేవల విభాగం హెచ్చరిస్తోంది. కాగా, విస్తృతమైన, ముందుజాగ్రత్తతో కూడిన భద్రతా చర్యల ఫలితమే ప్రమాదాలు మరియు ప్రాణనష్టం తగ్గడానికి కారణమని ఫుజైరా సివిల్ డిఫెన్స్కు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు.
వేసవి ఎండలు ముదిరేకొద్దీ, కూలింగ్ యూనిట్లపై అధిక విద్యుత్ ఒత్తిడి కారణంగా అగ్నిప్రమాదాల ముప్పు గణనీయంగా పెరుగుతుందని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఏసీ నిర్వహణను ఏర్పాటు చేసుకోవాలని, నాసిరకం విద్యుత్ కేబుళ్లను మార్చుకోవాలని సూచించారు.
ముఖ్యంగా రెసిడెన్సీ భవనాలకు సమ్మర్ అత్యధిక ప్రమాదకరమని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. బయటి వేడి పెరిగేకొద్దీ, పాత ఏసీ కంప్రెసర్లు అపార్ట్మెంట్లు మరియు విల్లాలను చల్లబరచడానికి ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తాయని, దీనివల్ల సర్వీస్ చేయని వైరింగ్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు.
గణాంకాల ప్రకారం, ఫుజైరా సివిల్ డిఫెన్స్ పరిష్కరించిన మొత్తం 145 అగ్నిప్రమాద ఘటనలలో, అత్యధికంగా 102 కేసులు నివాస గృహాల్లోనే సంభవించాయి.
సీజనల్ విద్యుత్ అగ్నిప్రమాదాల పెరుగుదలను నివారించడానికి, పౌర రక్షణ బృందాలు అధిక జనసాంద్రత గల నివాస భవనాలు మరియు పాత పరిసర ప్రాంతాలలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఇంటి యజమానులు మరియు రెంటర్స్ ఇద్దరూ తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని పౌర రక్షణ అధికారులు కోరుతున్నారు. ఇంటి యజమానులు వెంటనే ఏసీ కంప్రెసర్ తనిఖీలను చేయించుకోవాలని, ఖాళీ గదులలో కూలింగ్ యూనిట్లను నిరంతరాయంగా నడపకుండా ఉండాలని, తక్కువ నాణ్యత గల ఎక్స్టెన్షన్ కార్డ్ల వాడకాన్ని నిలిపివేయాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి మాల్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సందర్శన
- జెన్జీ ఎఫెక్ట్తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్







