మెక్సికో:నైట్క్లబ్ కాల్పుల్లో 15 మంది మృతి
- March 10, 2019
మెక్సికో: మెక్సికోలోని ఓ నైట్క్లబ్లో జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సలమాంకాలో ఉన్న నైట్క్లబ్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సలమాంకాలో రాష్ట్ర ఇంధన కంపెనీ పెట్రోలియస్ మెక్సికనోస్కు చెందిన మెయిన్ పైప్లైన్ ఉన్నది. ఈ పైప్లైన్ నుంచి కొందరు దుండగులు గత ఐదేండ్ల నుంచి భారీగా ఇంధన చోరీకి పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు శనివారం గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో నైట్క్లబ్లో కాల్పులు జరిగాయి. పోలీసులు మాట్లాడుతూ భారీగా ఆయుధాలు కలిగిన దుండగులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. దొంగలు ఐదేండ్ల కాలంలో రూ.21000 కోట్ల విలువైన ఇంధనాన్ని చోరీ చేశారని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









