మెక్సికో:నైట్క్లబ్ కాల్పుల్లో 15 మంది మృతి
- March 10, 2019మెక్సికో: మెక్సికోలోని ఓ నైట్క్లబ్లో జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సలమాంకాలో ఉన్న నైట్క్లబ్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సలమాంకాలో రాష్ట్ర ఇంధన కంపెనీ పెట్రోలియస్ మెక్సికనోస్కు చెందిన మెయిన్ పైప్లైన్ ఉన్నది. ఈ పైప్లైన్ నుంచి కొందరు దుండగులు గత ఐదేండ్ల నుంచి భారీగా ఇంధన చోరీకి పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు శనివారం గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో నైట్క్లబ్లో కాల్పులు జరిగాయి. పోలీసులు మాట్లాడుతూ భారీగా ఆయుధాలు కలిగిన దుండగులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. దొంగలు ఐదేండ్ల కాలంలో రూ.21000 కోట్ల విలువైన ఇంధనాన్ని చోరీ చేశారని వివరించారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?