హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- April 08, 2019
పర్సులో ఈ కార్డు ఉంటే చాలు. మెట్రో, బస్సు, క్యాబ్ ఏదైనా ఎక్కొచ్చు. త్వరలో హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి రానున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుపై రాష్ట్ర రవాణా శాఖ కసరత్తులు చేసి ఐటీ శాఖకు ప్రపోజల్ పెట్టింది. వీటిని పరిశీలించిన అనంతరం టెండర్లు పిలిచి కార్డు తయారీ పనులు అప్పగించనున్నారు అధికారులు.
ఈ కార్డులో క్యూఆర్ కోడ్, స్వైపింగ్ ఉంటాయి. వీటితో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే లండన్ మెట్రోలో అమలవుతున్న ఈ టెక్నాలజీ అక్కడ సక్సెస్ అవడంతో ఆ దిశగా ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ. దీనికి సంబంధించిన సమీక్ష గత నెల 27న జరిగింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కార్డు ద్వారా ప్రయాణంతో పాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా పార్కింగ్ సమయాల్లో, టోల్ ట్యాక్స్ చెల్లింపులకు కూడా కార్డు ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కార్డు కనీస రీచార్జ్ విలువ రూ.1000 ఉండనుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







