హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- April 08, 2019
పర్సులో ఈ కార్డు ఉంటే చాలు. మెట్రో, బస్సు, క్యాబ్ ఏదైనా ఎక్కొచ్చు. త్వరలో హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి రానున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుపై రాష్ట్ర రవాణా శాఖ కసరత్తులు చేసి ఐటీ శాఖకు ప్రపోజల్ పెట్టింది. వీటిని పరిశీలించిన అనంతరం టెండర్లు పిలిచి కార్డు తయారీ పనులు అప్పగించనున్నారు అధికారులు.
ఈ కార్డులో క్యూఆర్ కోడ్, స్వైపింగ్ ఉంటాయి. వీటితో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే లండన్ మెట్రోలో అమలవుతున్న ఈ టెక్నాలజీ అక్కడ సక్సెస్ అవడంతో ఆ దిశగా ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ. దీనికి సంబంధించిన సమీక్ష గత నెల 27న జరిగింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కార్డు ద్వారా ప్రయాణంతో పాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా పార్కింగ్ సమయాల్లో, టోల్ ట్యాక్స్ చెల్లింపులకు కూడా కార్డు ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కార్డు కనీస రీచార్జ్ విలువ రూ.1000 ఉండనుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







