హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- April 08, 2019
పర్సులో ఈ కార్డు ఉంటే చాలు. మెట్రో, బస్సు, క్యాబ్ ఏదైనా ఎక్కొచ్చు. త్వరలో హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి రానున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుపై రాష్ట్ర రవాణా శాఖ కసరత్తులు చేసి ఐటీ శాఖకు ప్రపోజల్ పెట్టింది. వీటిని పరిశీలించిన అనంతరం టెండర్లు పిలిచి కార్డు తయారీ పనులు అప్పగించనున్నారు అధికారులు.
ఈ కార్డులో క్యూఆర్ కోడ్, స్వైపింగ్ ఉంటాయి. వీటితో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే లండన్ మెట్రోలో అమలవుతున్న ఈ టెక్నాలజీ అక్కడ సక్సెస్ అవడంతో ఆ దిశగా ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ. దీనికి సంబంధించిన సమీక్ష గత నెల 27న జరిగింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కార్డు ద్వారా ప్రయాణంతో పాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా పార్కింగ్ సమయాల్లో, టోల్ ట్యాక్స్ చెల్లింపులకు కూడా కార్డు ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కార్డు కనీస రీచార్జ్ విలువ రూ.1000 ఉండనుంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







