హమాద్ కార్యాలయంలో కొత్త ఇనీషియేట్
- December 30, 2015
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమాద్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కార్యాలయం కొత్త ఇనీషియేటివ్ని ప్రారంభించింది. 'ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016' అనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. వారంలో మూడు రోజులపాటు వివిధ అంశాలపై పఠనం అనేది ఉద్యోగులకు అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయడంలో హమాద్ కార్యాలయం ఎప్పుడూ ముందుంటుంది. పఠనం ద్వారా తమ స్కిల్స్ని పెంచుకోవడానికి ఉద్యోగులకు వీలువుతుందనీ, వివిధ అంశాలపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా ఉద్యోగులు ఇంకా సమర్థవంతంగా పనిచేస్తారని హమాద్ కార్యాలయం డైరెక్టర్ జనరల్ సైఫ్ బిన్ మర్కాన్ కెట్బి చెప్పారు. అబుదాబీ, షార్జాలలో జరిగిన బుక్ ఎగ్జిబిషన్స్, జాతీయ ఎజెండా 2021లో భాగంగా అందరిలో పఠనాసక్తిని పెంచాల్సి ఉందని, ఆ క్రమంలో హమాద్ కార్యాలయం ముందడుగు వేసిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









