హమాద్ కార్యాలయంలో కొత్త ఇనీషియేట్
- December 30, 2015
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమాద్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కార్యాలయం కొత్త ఇనీషియేటివ్ని ప్రారంభించింది. 'ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016' అనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. వారంలో మూడు రోజులపాటు వివిధ అంశాలపై పఠనం అనేది ఉద్యోగులకు అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయడంలో హమాద్ కార్యాలయం ఎప్పుడూ ముందుంటుంది. పఠనం ద్వారా తమ స్కిల్స్ని పెంచుకోవడానికి ఉద్యోగులకు వీలువుతుందనీ, వివిధ అంశాలపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా ఉద్యోగులు ఇంకా సమర్థవంతంగా పనిచేస్తారని హమాద్ కార్యాలయం డైరెక్టర్ జనరల్ సైఫ్ బిన్ మర్కాన్ కెట్బి చెప్పారు. అబుదాబీ, షార్జాలలో జరిగిన బుక్ ఎగ్జిబిషన్స్, జాతీయ ఎజెండా 2021లో భాగంగా అందరిలో పఠనాసక్తిని పెంచాల్సి ఉందని, ఆ క్రమంలో హమాద్ కార్యాలయం ముందడుగు వేసిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







