ఉత్తరం
- May 14, 2015
సమాచారాన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేయడానికి ఉపయోగించే సాధనం. పాపం అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి బలైపోయావు. గతంలో నీ రాక గురించి వారాలు, నెలల తరబడి వేచి చూసేవారు. ఎక్కువగా కుటుంబ క్షేమ సమాచారాలు చేరవేసేవాడివి. నీవు బాగా బ్రతికినంత కాలము సమాజంలో బంధాలు, బాంధవ్యాలు, కష్టసుఖాలు పంచుకోవడానికి నీవుచేసిన కృషి మరువరానిది. కొన్ని సందర్భాల్లో నీరాక ఆలస్యమైనప్పుడు తంతి కార్యాలయానికి (పోస్టాఫీసు) వెళ్లి మరీ నీ గురించి వాకబు చేసేవాళ్ళు. ఎందుకంటే మనుషుల మధ్య వారధి నువ్వే! నీ సేవ మరపురానిది, మరువలేనిది మరియు మరలరానిదిగా మిగిలిపోయింది. నిన్ను మరల బ్రతికించేందుకు కూడా చేరుకోలేని చిరునామాకి చిరస్థాయిగా చేరిపోయావు, చివరికి. కానీ నీవు మాకందించిన గుర్తులు ప్రత్యక్ష సాక్షులుగా మా అందరి హృదయాల్లో నిక్షిప్తంగా నేటికీ జీవిస్తూనే ఉన్నావు. మానవాళి సహజీవనంలో నీవు పోషించిన పాత్ర శాశ్వతము అని చెప్పడంలో సందేహం లేదు.
-----యస్.పి. సోమ సుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







