పుస్తక ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త
- April 14, 2019ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ ద్వారా పుస్తకాలు చదివేలా ఓ యాప్ను రూపొందించింది. దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఈ యాప్లో దాదాపు 70వేలకు పైగా పుస్తకాలను పొందుపరుస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. కేవలం ఎయిర్టెల్ కస్టమర్స్ ఏ కాకుండా.. నాన్ ఎయిర్టెల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలపై కూడా.. ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ లభిస్తుంది.
ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ కస్టమర్ అయినా సరే మొదటి 30 రోజులు ట్రయల్ పీరియడ్లో పుస్తకాలు చదవొచ్చు. ఆ తరువాత నుంచీ నెలవారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలలకు అయితే రూ.129., 12 నెలలకు అయితే రూ.199 చెల్లించి ఈ యాప్ ద్వారా.. పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ కస్టమర్లయితే.. 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావల్సిన బుక్స్ను చదువుకోవడంతో పాటు కావాలని అనిపిస్తే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇంకేంటి మరీ పుస్తక ప్రియులారా.. ఇక మీ ప్రయాణాల్లో విసిగిపోకుండా.. చక్కగా మీకు నచ్చిన పుస్తకాన్ని స్మార్ట్ఫోన్లో చదివుకోండి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..