పుస్తక ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త
- April 14, 2019
ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ ద్వారా పుస్తకాలు చదివేలా ఓ యాప్ను రూపొందించింది. దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఈ యాప్లో దాదాపు 70వేలకు పైగా పుస్తకాలను పొందుపరుస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. కేవలం ఎయిర్టెల్ కస్టమర్స్ ఏ కాకుండా.. నాన్ ఎయిర్టెల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలపై కూడా.. ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ లభిస్తుంది.
ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ కస్టమర్ అయినా సరే మొదటి 30 రోజులు ట్రయల్ పీరియడ్లో పుస్తకాలు చదవొచ్చు. ఆ తరువాత నుంచీ నెలవారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలలకు అయితే రూ.129., 12 నెలలకు అయితే రూ.199 చెల్లించి ఈ యాప్ ద్వారా.. పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ కస్టమర్లయితే.. 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావల్సిన బుక్స్ను చదువుకోవడంతో పాటు కావాలని అనిపిస్తే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇంకేంటి మరీ పుస్తక ప్రియులారా.. ఇక మీ ప్రయాణాల్లో విసిగిపోకుండా.. చక్కగా మీకు నచ్చిన పుస్తకాన్ని స్మార్ట్ఫోన్లో చదివుకోండి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







