హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం
- April 14, 2019
నేపాల్:నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మిట్ ఎయిర్కు చెందిన ఓ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ హెలిప్యాడ్లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్మండూకు వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న విమానం రన్వేపై నుంచి అదుపుతప్పి హెలిప్యాడ్లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై రామ్ బహదూర్, కోపైలట్ ఢుంగానా అక్కడిక్కడే మృతి చెందారు. ఏఎస్సై బహదూర్ శ్రేష్ఠ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలొదిలరాని వైమానిక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







