హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం
- April 14, 2019నేపాల్:నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మిట్ ఎయిర్కు చెందిన ఓ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ హెలిప్యాడ్లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్మండూకు వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న విమానం రన్వేపై నుంచి అదుపుతప్పి హెలిప్యాడ్లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై రామ్ బహదూర్, కోపైలట్ ఢుంగానా అక్కడిక్కడే మృతి చెందారు. ఏఎస్సై బహదూర్ శ్రేష్ఠ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలొదిలరాని వైమానిక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం