హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం
- April 14, 2019
నేపాల్:నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మిట్ ఎయిర్కు చెందిన ఓ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ హెలిప్యాడ్లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్మండూకు వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న విమానం రన్వేపై నుంచి అదుపుతప్పి హెలిప్యాడ్లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై రామ్ బహదూర్, కోపైలట్ ఢుంగానా అక్కడిక్కడే మృతి చెందారు. ఏఎస్సై బహదూర్ శ్రేష్ఠ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలొదిలరాని వైమానిక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







