పుస్తక ప్రియులకు ఎయిర్‌టెల్‌ శుభవార్త

- April 14, 2019 , by Maagulf
పుస్తక ప్రియులకు ఎయిర్‌టెల్‌ శుభవార్త

ఎయిర్‌ టెల్‌ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా పుస్తకాలు చదివేలా ఓ యాప్‌ను రూపొందించింది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఇ-బుక్స్ యాప్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ యాప్‌లో దాదాపు 70వేలకు పైగా పుస్తకాలను పొందుపరుస్తుంది. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. కేవలం ఎయిర్‌టెల్‌ కస్టమర్స్‌ ఏ కాకుండా.. నాన్ ఎయిర్‌టెల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై కూడా.. ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ లభిస్తుంది.

ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ కస్టమర్ అయినా సరే మొదటి 30 రోజులు ట్రయల్ పీరియడ్‌లో పుస్తకాలు చదవొచ్చు. ఆ తరువాత నుంచీ నెలవారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలలకు అయితే రూ.129., 12 నెలలకు అయితే రూ.199 చెల్లించి ఈ యాప్‌ ద్వారా.. పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక ఎయిర్‌టెల్ కస్టమర్లయితే.. 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావల్సిన బుక్స్‌ను చదువుకోవడంతో పాటు కావాలని అనిపిస్తే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇంకేంటి మరీ పుస్తక ప్రియులారా.. ఇక మీ ప్రయాణాల్లో విసిగిపోకుండా.. చక్కగా మీకు నచ్చిన పుస్తకాన్ని స్మార్ట్‌ఫోన్‌లో చదివుకోండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com