పుస్తక ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త
- April 14, 2019
ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ ద్వారా పుస్తకాలు చదివేలా ఓ యాప్ను రూపొందించింది. దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఈ యాప్లో దాదాపు 70వేలకు పైగా పుస్తకాలను పొందుపరుస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. కేవలం ఎయిర్టెల్ కస్టమర్స్ ఏ కాకుండా.. నాన్ ఎయిర్టెల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలపై కూడా.. ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ లభిస్తుంది.
ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ కస్టమర్ అయినా సరే మొదటి 30 రోజులు ట్రయల్ పీరియడ్లో పుస్తకాలు చదవొచ్చు. ఆ తరువాత నుంచీ నెలవారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలలకు అయితే రూ.129., 12 నెలలకు అయితే రూ.199 చెల్లించి ఈ యాప్ ద్వారా.. పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ కస్టమర్లయితే.. 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావల్సిన బుక్స్ను చదువుకోవడంతో పాటు కావాలని అనిపిస్తే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇంకేంటి మరీ పుస్తక ప్రియులారా.. ఇక మీ ప్రయాణాల్లో విసిగిపోకుండా.. చక్కగా మీకు నచ్చిన పుస్తకాన్ని స్మార్ట్ఫోన్లో చదివుకోండి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







