ఫ్లూ కేసుల పెరుగుదల నేపథ్యంలో యూఏఈ స్కూల్స్ వార్నింగ్
- April 17, 2019
యూ.ఏ.ఈ:డాక్టర్లు, స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు 'పెరుగుతున్న ఫ్లూ కేసుల' విషయమై హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ క్రియేటివ్ సైన్స్, పేరెంట్స్కి గత వారం ఓ సర్క్యులర్ జారీ చేశారు. సెలవుల తర్వాత తిరిగి వచ్చిన కొందరు విద్యార్థుల కారణంగా ఫ్లూ విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఐఎస్సిఎస్ నాడి అల్ షెబా ప్రిన్సిపల్ నవీద్ ఇక్బాల్ మాట్లాడుతూ, వాతావరనంలో మార్పులు, అలాగే సెలవుల కోసం వెళ్ళి తిరిగొచ్చిన విద్యార్థుల కారణంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయనీ, ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు. ఫ్లూ లక్షణాలు కన్పిస్తే, ఇంటి వద్దనే వుంచి పిల్లలకు వైద్య చికిత్స అందించాలనీ, స్కూల్కి పంపించడం వల్ల ఇతరులకు ఆ ఫ్లూ సోకే అవకాశం వుందని వైద్యులు, స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. మెడియార్ హాస్పిటల్ దుబాయ్కి చెందిన పిడియాట్రీషియన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ గాందీ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్స్ తర్వాత కూడా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని వాతావరణ మార్పుల కారణంగానే ఇది జరుగుతోందనీ, పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







