డిగ్రీ అర్హతతో బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు..
- April 17, 2019
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి మే6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 145
ఇంజనీర్ ట్రైనీలో పోస్టుల సంఖ్య: 100
ఇందులో మెకానికల్ : 40
ఎలక్ట్రికల్: 30
సివిల్ : 20
కెమికల్ : 10
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యూయల్ డిగ్రీ
వయోపరిమితి: 01.04.2019 నాటికి 27 సంవత్సరాలు. 01.04.1992 తర్వాత జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పీజీ డిగ్రీ (ఇంజనీరింగ్/ బిజినెస్
అడ్మినిస్ట్రేషన్/మేనేజ్మెంట్) ఉన్నవారి 29 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 45
హెచ్ఆర్: 20
ఫైనాన్స్ : 25
అర్హత: హెచ్ఆర్ విభాగానికి 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ/ డిప్లొమా (హెచ్ఆర్/పర్సనల్ మేనేజ్మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
ఉండాలి. పర్సనల్ మేనేజ్మెంట్/లేబర్ వెల్ఫేర్/ హెచ్ఆర్ఎమ్ స్పెషలైజేషన్లుగా ఉండాలి.
ఫైనాన్స్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సీఏ, సీడబ్ల్యూఏ చదివి ఉండాలి.
వయోపరిమితి: 01.04.2019 నాటికి 29 సంవత్సరాలు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టుల ప్రకారం 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాతపరీక్షకు 75%,
ఇంటర్వ్యూకు 25% ప్రకారం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో పేస్కేలు రూ.50,000 – రూ.1,60,000 (బేసిక్ పే రూ.50,000) ఉంటుంది. శిక్షణ అనంతరం
ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ హోదాలో పే స్కేల్ రూ.60,000 – రూ.1,80,000 (బేసిక్ పే రూ.60,000) చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.04.2019
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.05.2019
పరీక్ష తేదీ: మే25, 26 తేదీల్లో.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







