హైదరాబాద్:అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం
- April 19, 2019
హైదరాబాద్లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కృష్ణానగర్, పంజాగుట్టా తదితర ప్రాంతాల్లో పది నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బలమైన ఈరుదుగాలులకు చాలా చోట్ల చెట్లు, హోర్డింగ్లు విరిగిపడ్డాయి.
కృష్ణానగర్, యూసఫ్గూడా తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోకి చేరిన నీరును డబ్బాలతో తోడి పోశారు. దీంతో రాత్రంతా ప్రజలు జాగరణం చేయాల్సి వచ్చింది. పలు చోట్ల కరెంట్ పోవడంతో.. జనం ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా.. తమ సమస్యను పరిష్కరించ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







