యూఏఈ రెసిడెంట్స్‌కి కొత్త ఫైనాన్షియల్‌ స్కామ్‌పై హెచ్చరిక

- April 19, 2019 , by Maagulf
యూఏఈ రెసిడెంట్స్‌కి కొత్త ఫైనాన్షియల్‌ స్కామ్‌పై హెచ్చరిక

అబుదాబీ:నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ప్రతినిథులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై అబుదాబీ పోలీస్‌ పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేస్‌ బుక్‌ ద్వారా ఈ వార్నింగ్‌ని జారీ చేయడం జరిగింది. బహుమతులు గెలిచారంటూ ఫోన్‌ చేయడం లేదా టెక్స్‌ట్‌ మెసేజ్‌ చేయడం ద్వారా అమాయకులకు వల విసురుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. క్రిమినల్‌ సెక్యూరిటీ డివిజన్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టరేట్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ఒమ్రాన్‌ అహ్మద్‌ అల్‌ మజ్రోయి మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి వుందని అన్నారు. ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌కి ప్రజలు స్పందించవద్దని ఆయన సూచించారు. బ్యాంక్‌ అకౌంట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు గోప్యంగా వుంచుకోవాలని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com