యూఏఈ రెసిడెంట్స్కి కొత్త ఫైనాన్షియల్ స్కామ్పై హెచ్చరిక
- April 19, 2019
అబుదాబీ:నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రతినిథులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై అబుదాబీ పోలీస్ పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఈ వార్నింగ్ని జారీ చేయడం జరిగింది. బహుమతులు గెలిచారంటూ ఫోన్ చేయడం లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడం ద్వారా అమాయకులకు వల విసురుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. క్రిమినల్ సెక్యూరిటీ డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఒమ్రాన్ అహ్మద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి వుందని అన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్కి ప్రజలు స్పందించవద్దని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డుల వివరాలు గోప్యంగా వుంచుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







