మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం
- December 31, 2015
రెండు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స స్వదేశంలో విజయవంతమైంది. యునైటెడ్ కింగ్డమ్ లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రులకు చెందిన ఒక వైద్య బృందం హమాద్ మెడికల్ కార్పొరేషన్ ను సందర్శించి ఇరువురికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. ఖతర్ మరియు జోర్డాన్ దేశాలకు చెందిన మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న ఇరువురు మహిళలు దోహలో ఉన్న వారి సోదరీలు అవయువ దానానికి అంగీకరించడంతో కిడ్నీ మార్పిడి జరిగి ఆ శస్త్ర చికిత్స విజయవంతం కాబడినట్లు మెడికల్ డైరెక్టర్ ఆఫ్ హమద్ జనరల్ హాస్పిటల్ మరియు ది డైరెక్టర్ ఆఫ్ ఖతర్ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ డాక్టర్ యూసఫ్ అల్ మసిలిమని చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇరువురు రోగులు మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నట్లు, వారం రొఊల తర్వాత వారిని తమ ఆసుపత్రి నుంచి విడుదల చేయనున్నట్లు అయన తెలిపారు. ఇకపై అవయువ మార్పిడికి రోగులు వారి బంధువులు విదేశాలకు వెళ్ళనవసరం లేదని , స్వదేశంలోనే ఎంతో మెరుగైన సేవలు లభ్యం కానున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







