2015 లో 9 శాతం ప్రయాణికుల వృద్ది
- December 31, 2015
2015 లో 51.3 ఎం యెన్ . ప్రయాణికులను ఎమరేట్ ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గత ఏడాదితో సరిపోల్చితే , 9 శాతం ప్రయాణికుల వృద్ది సాధించినట్లు రవాణ సంస్థ బుధవారం తెలిపింది. దీంతోబాటు గణనీయమైన వృద్దిని సాధించినట్లు ముఖ్య కార్యనిర్వాహణాఢికారి టిం క్లార్క్ అన్నారు. ప్రాంతీయ సంఘర్షణ , అనుకూలం గాని కరెన్సీ ప్రభావం తదితర ప్రతికూల సమస్యలు ఉన్నప్పటకి, తమకు ప్రయాణికుల మద్దతు ఉందని కనుకనే ప్రయాణికుల వృద్ది శాతం పెరగడంతో తమపై విశ్వసనీయత పెరగడం ఒక మంచి సంకేతమన్నారు. మధ్య ప్రాచ్య దేశాలలో అతి పెద్ద విమాన సంస్థ ఎమరట్స్ 246 విమానాలను , 15 ఎయిర్ బస్సులను , ఎ 380 ఎస్ మరియు 10 బొఇంగ్ 777 సహా , ఈ ఏడాది 26 కొత్త విమానాలను ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 30 ఏళ్ళ క్రితం స్థాపించిన ఎమరట్స్ విమాన సంస్థ 150 గమ్య స్థానాలకు ఎగురుతూ , ప్రపంచం లోనే అతి పెద్ద అంతర్జాతీయ ప్రయాణ కేంద్రం మారి, లండన్ లోని హెఅథ్రొవ్ విమాన సంస్థను అధిగమించిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







