శ్రీలంక పేలుళ్ళ కేసు : ఏడుగురు అనుమానితుల అరెస్ట్
- April 21, 2019కొలంబో:వందల మంది జీవితాలను అగాధంలోకి నెట్టిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఏడుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన 8 వరుస బాంబు పేలుళ్ళలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 27 మంది విదేశీయులు, 350 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
ఎనిమిదో పేలుడు కొలంబో శివారులోని దెమటగోడలో సంభవించింది. ఈ ప్రాంతంలో అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఈ అనుమానితులు ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఆదివారం ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 పేలుళ్ళు సంభవించినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళు, ఓ గెస్ట్ హౌస్ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపింది. ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ