శ్రీలంక పేలుళ్ళ కేసు : ఏడుగురు అనుమానితుల అరెస్ట్
- April 21, 2019
కొలంబో:వందల మంది జీవితాలను అగాధంలోకి నెట్టిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఏడుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన 8 వరుస బాంబు పేలుళ్ళలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 27 మంది విదేశీయులు, 350 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
ఎనిమిదో పేలుడు కొలంబో శివారులోని దెమటగోడలో సంభవించింది. ఈ ప్రాంతంలో అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఈ అనుమానితులు ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఆదివారం ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 పేలుళ్ళు సంభవించినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళు, ఓ గెస్ట్ హౌస్ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపింది. ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









