శ్రీలంక పేలుళ్ళ కేసు : ఏడుగురు అనుమానితుల అరెస్ట్
- April 21, 2019
కొలంబో:వందల మంది జీవితాలను అగాధంలోకి నెట్టిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఏడుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన 8 వరుస బాంబు పేలుళ్ళలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 27 మంది విదేశీయులు, 350 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
ఎనిమిదో పేలుడు కొలంబో శివారులోని దెమటగోడలో సంభవించింది. ఈ ప్రాంతంలో అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఈ అనుమానితులు ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఆదివారం ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 పేలుళ్ళు సంభవించినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళు, ఓ గెస్ట్ హౌస్ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపింది. ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..