తిరుపతి:వీడియో కాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు
- April 23, 2019
తిరుపతి:నేటి యువతలో ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యసనాలకు బానిసలుగా మారి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆవేశపూరిత నిర్ణయాలతో భవిష్యత్ శూన్యం చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతికి చెందిన శివకుమార్ అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి తాగిన మైకంలో ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చేప్పి లైవ్లోనే దారుణానికి పాల్పడ్డాడు. చనిపోతున్నా… చూడు అంటూ ఫ్యాన్కు ఉరేసుకుని మంచంపై నిలబడ్డాడు. స్నేహితుడు దాన్ని తమాషా అనుకున్నాడు. కానీ మంచంపై నుంచి కాలు కిందకు వేలాడడం చూసి హుటాహుటిన అతని దగ్గరకు పరిగెత్తాడు. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. శివకుమార్ తిరుపతిలో మెకానిక్గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







