తిరుపతి:వీడియో కాల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు
- April 23, 2019
తిరుపతి:నేటి యువతలో ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యసనాలకు బానిసలుగా మారి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఆవేశపూరిత నిర్ణయాలతో భవిష్యత్ శూన్యం చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతికి చెందిన శివకుమార్ అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి తాగిన మైకంలో ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చేప్పి లైవ్లోనే దారుణానికి పాల్పడ్డాడు. చనిపోతున్నా… చూడు అంటూ ఫ్యాన్కు ఉరేసుకుని మంచంపై నిలబడ్డాడు. స్నేహితుడు దాన్ని తమాషా అనుకున్నాడు. కానీ మంచంపై నుంచి కాలు కిందకు వేలాడడం చూసి హుటాహుటిన అతని దగ్గరకు పరిగెత్తాడు. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. శివకుమార్ తిరుపతిలో మెకానిక్గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









