ఎమిరేట్స్ పోస్ట్కి అనుకోని అతిథిని పంపిన షేక్ మొహమ్మద్
- April 23, 2019
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పూర్ సర్వీసుల్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశారాయన. ఎమిరేట్స్ పోస్ట్కి ఓ అనుకోని అతిథిని పంపిన షేక్ మొహమ్మద్, అక్కడి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకున్నారు. క్యూ లైన్లలో ఆ అతిథి నిల్చుని వున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్వీసుల్లో ఆలస్యం చాలా బాధాకరమని చెప్పారు. ఎమిరేట్స్ పోస్ట్ సర్వీసెస్ విషయమై వాస్తవ పరిస్థితుల్ని తెలిపేందుకు టీమ్ని పంపిన షేక్ మొహమ్మద్, అక్కడి సర్వీసులు తగిన విధంగా లేవని నిర్ధారణకు వచ్చారు. కాగా, గవర్నమెంట్ బాడీస్కి ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ విషయమై హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని సంస్థలు ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ విషయంలో 93 శాతం ప్రగతిని సాధించాయని చెప్పారు. ఐదు సంస్థలు మాత్రం 60 శాతానికే పరిమితమయ్యాయి. దీన్ని సహించేది లేదనీ, ఎంప్లాయీ శాటిస్ఫ్యాక్షన్ అతి ముఖ్యమైనదనీ అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







