ఎమిరేట్స్ పోస్ట్కి అనుకోని అతిథిని పంపిన షేక్ మొహమ్మద్
- April 23, 2019
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పూర్ సర్వీసుల్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశారాయన. ఎమిరేట్స్ పోస్ట్కి ఓ అనుకోని అతిథిని పంపిన షేక్ మొహమ్మద్, అక్కడి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకున్నారు. క్యూ లైన్లలో ఆ అతిథి నిల్చుని వున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్వీసుల్లో ఆలస్యం చాలా బాధాకరమని చెప్పారు. ఎమిరేట్స్ పోస్ట్ సర్వీసెస్ విషయమై వాస్తవ పరిస్థితుల్ని తెలిపేందుకు టీమ్ని పంపిన షేక్ మొహమ్మద్, అక్కడి సర్వీసులు తగిన విధంగా లేవని నిర్ధారణకు వచ్చారు. కాగా, గవర్నమెంట్ బాడీస్కి ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ విషయమై హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని సంస్థలు ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ విషయంలో 93 శాతం ప్రగతిని సాధించాయని చెప్పారు. ఐదు సంస్థలు మాత్రం 60 శాతానికే పరిమితమయ్యాయి. దీన్ని సహించేది లేదనీ, ఎంప్లాయీ శాటిస్ఫ్యాక్షన్ అతి ముఖ్యమైనదనీ అన్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









