దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించిన కేటీఆర్
- April 26, 2019
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూడుచింతల తండాకు చెందిన ధీరావత్ మహేశ్ దివ్యాంగ క్రీడాకారుడు. త్వరలో చైనాలో జరిగే ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు మహేశ్ ఎంపికయ్యాడు. అలాగే పారా క్రికెట్ ఇండియా టీమ్ వైస్కెప్టెన్గా కూడా ఉన్నాడు. మే నెలలో చైనాలో బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. అయితే మహేశ్కు అక్కడికి వెళ్లడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ మహేశ్కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిచారు. తనకు సాయం అందించిన కేటీఆర్కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







