దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించిన కేటీఆర్

- April 26, 2019 , by Maagulf
దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించిన కేటీఆర్

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం మూడుచింతల తండాకు చెందిన ధీరావత్ మహేశ్ దివ్యాంగ క్రీడాకారుడు. త్వరలో చైనాలో జరిగే ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు మహేశ్ ఎంపికయ్యాడు. అలాగే పారా క్రికెట్ ఇండియా టీమ్ వైస్‌కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. మే నెలలో చైనాలో బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. అయితే మహేశ్‌కు అక్కడికి వెళ్లడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ మహేశ్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిచారు. తనకు సాయం అందించిన కేటీఆర్‌కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com