బంగారం తళుకులు తగ్గాయి
- January 01, 2016
ఏడాది చివరి రోజు దేశీయ మార్కెట్లో బంగారం తళుకులు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర 25,000 రూపాయల దిగువకు జారింది. స్టాకిస్టులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో వరుసగా మూడో ఏడాదిలోనూ పసిడి ధర క్షీణతనే చవిచూసింది. ఏడాదిలో పసిడి ధర 1,740 రూపాయలు (6.51 శాతం) మేర తగ్గిపోయింది. ఇక వరుసగా ఐదో రోజూ వెండి ధర క్షీణించింది. ముంబై మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం 175 రూపాయలు తగ్గి 24,980 రూపాయలకు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 25,130 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 95 రూపాయల నష్టంతో 33,565 రూపాయలకు క్షీణించింది. 2014తో పోల్చితే 2015 సంవత్సరంలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 6.51 శాతం, ప్యూర్ బంగారం ధర 6.48 శాతం, వెండి ధర 9.78 శాతం క్షీణించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







