బంగారం తళుకులు తగ్గాయి

- January 01, 2016 , by Maagulf
బంగారం తళుకులు తగ్గాయి

ఏడాది చివరి రోజు దేశీయ మార్కెట్లో బంగారం తళుకులు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర 25,000 రూపాయల దిగువకు జారింది. స్టాకిస్టులు, రిటైల్‌ కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో వరుసగా మూడో ఏడాదిలోనూ పసిడి ధర క్షీణతనే చవిచూసింది. ఏడాదిలో పసిడి ధర 1,740 రూపాయలు (6.51 శాతం) మేర తగ్గిపోయింది. ఇక వరుసగా ఐదో రోజూ వెండి ధర క్షీణించింది. ముంబై మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం 175 రూపాయలు తగ్గి 24,980 రూపాయలకు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 25,130 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 95 రూపాయల నష్టంతో 33,565 రూపాయలకు క్షీణించింది. 2014తో పోల్చితే 2015 సంవత్సరంలో 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర 6.51 శాతం, ప్యూర్‌ బంగారం ధర 6.48 శాతం, వెండి ధర 9.78 శాతం క్షీణించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com