బంగారం తళుకులు తగ్గాయి
- January 01, 2016
ఏడాది చివరి రోజు దేశీయ మార్కెట్లో బంగారం తళుకులు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర 25,000 రూపాయల దిగువకు జారింది. స్టాకిస్టులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో వరుసగా మూడో ఏడాదిలోనూ పసిడి ధర క్షీణతనే చవిచూసింది. ఏడాదిలో పసిడి ధర 1,740 రూపాయలు (6.51 శాతం) మేర తగ్గిపోయింది. ఇక వరుసగా ఐదో రోజూ వెండి ధర క్షీణించింది. ముంబై మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం 175 రూపాయలు తగ్గి 24,980 రూపాయలకు చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 25,130 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 95 రూపాయల నష్టంతో 33,565 రూపాయలకు క్షీణించింది. 2014తో పోల్చితే 2015 సంవత్సరంలో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 6.51 శాతం, ప్యూర్ బంగారం ధర 6.48 శాతం, వెండి ధర 9.78 శాతం క్షీణించింది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







