మోదీపై పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్‌ రైతులు

- April 29, 2019 , by Maagulf
మోదీపై పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్‌ రైతులు

వారణాసి:మొన్న నిజామాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన రైతలు.. ఇప్పుడు నేరుగా వారణాసిలో నామినేషన్లు వేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ నుంచి ఇవాళ నిజామాబాద్‌ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు తమ నిరసన తెలిపేందుకు వారణాసిలో నామినేషన్లు వేశారు. జిల్లా నుంచి దాదాపు 50 మంది రైతులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకే వారంతా క్యూ లైన్‌లో నిలబడి ఉండడంతో నామినేషన్‌ వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.వారణాసికి రైతులకు మద్దతుగా కోటపాటి నర్సింహం నాయుడు కూడా వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com