ఈ ఉల్లంఘనకు పాల్పడితే 100,000 దిర్హామ్ల జరీమానా, జైలు శిక్ష
- April 30, 2019యూ.ఏ.ఈ:ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ ఇన్ దుబాయ్ (ఇఎడి), 200 కిలోల ఓయ్స్టర్స్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇఎడి వెల్లడించింది. విక్రయించేందుకోసం పెద్ద మొత్తంలో ఓయ్స్టర్స్ని కొందరు వ్యక్తులు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారికి జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశముందని అధికారులు వివరించారు. ఓయ్స్టర్స్ని వెంటనే విడిచిపెట్టడం జరిగిందనీ, ఎకో సిస్టమ్లో వాటి పాత్ర చాలా ముఖ్యమైనదని ఇఎడి పేర్కొంది. ఫెడరల్ చట్టం నెంబర్ 23 (1999) ప్రకారం, ఓయ్స్టర్స్ ఎక్స్ట్రాక్షన్కి 6 నెలలకు తక్కువ కాని విధంగా జైలు శిక్ష, అలాగే 50,000 నుంచి 100,000 దిర్హామ్ల జరీమానా విధించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం