ఇండియా:నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం
- May 07, 2019హైదరాబాద్: ఈరోజు నుండి పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆకాశంలో నెలవంక కన్పించిందని చార్మినార్ పరిసర మసీదుల నుంచి సైరన్ మోతలు విన్పించాయి. రూహిత్హిలాల్ కమిటీ ప్రతినిధులు సైతం నెలవంక దర్శనమిచ్చిందని సమాచారం అందించారు. దీంతో ముస్లింలు చాంద్ ముబారక్ (చంద్రవంక శుభాకాంక్షలు) తెలుపుకొన్నారు. నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. మక్కామసీదులో సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు తరావీహ్ నమాజ్ నిర్వహించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఏడో తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వెళ్లవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ