ఇండియా:నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం
- May 07, 2019
హైదరాబాద్: ఈరోజు నుండి పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆకాశంలో నెలవంక కన్పించిందని చార్మినార్ పరిసర మసీదుల నుంచి సైరన్ మోతలు విన్పించాయి. రూహిత్హిలాల్ కమిటీ ప్రతినిధులు సైతం నెలవంక దర్శనమిచ్చిందని సమాచారం అందించారు. దీంతో ముస్లింలు చాంద్ ముబారక్ (చంద్రవంక శుభాకాంక్షలు) తెలుపుకొన్నారు. నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. మక్కామసీదులో సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు తరావీహ్ నమాజ్ నిర్వహించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఏడో తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వెళ్లవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







