ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాలు

- May 11, 2019 , by Maagulf
ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాలు

బహ్రెయిన్‌: ఒకే రోజు రెండు కారు ప్రమాదాలు పది గంటల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ కాజ్‌ వే మీద ఓ రోడ్డు ప్రమాదం జరుగగా, సనాబిస్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అతి వేగం కారణంగానే ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘటనలో కారు ఓవర్న్‌ టర్న్‌ అయి పామ్‌ టీని ఢీకొంది. మరో ఘటనలో కారు, డెలివరీ బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్లకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే బైక్‌ మీద వెళుతున్న వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, పరిమిత వేగంతో వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com