యూఏఈలో భారత వలసదారులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసిన ఎంబసీ
- May 11, 2019
అబుధాబి:యూఏఈలోని ఇండియన్ ఎంబసీ, తమ పౌరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. చేసిన పనికి జీతం దక్కని పక్షంలో, ఎంబసీని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ ఈ ప్రకటనను విడుదల చేశారు. జీతాలు దక్కని కారణంగా భారతీయ వలసదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి వారు ఎక్కువగా పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్న అధికారులు, ఎంబసీని సంప్రదిస్తే, తగు న్యాయం జరగడానికి చర్యలు తీసుకుంటామనీ, రిటర్న్ టిక్కెట్లు ఇచ్చి స్వదేశానికి పంపడం ద్వారా ఇబ్బందుల్లో వున్నవారి సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారత వలసదారుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









