యూఏఈలో భారత వలసదారులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసిన ఎంబసీ
- May 11, 2019
అబుధాబి:యూఏఈలోని ఇండియన్ ఎంబసీ, తమ పౌరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. చేసిన పనికి జీతం దక్కని పక్షంలో, ఎంబసీని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ ఈ ప్రకటనను విడుదల చేశారు. జీతాలు దక్కని కారణంగా భారతీయ వలసదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి వారు ఎక్కువగా పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్న అధికారులు, ఎంబసీని సంప్రదిస్తే, తగు న్యాయం జరగడానికి చర్యలు తీసుకుంటామనీ, రిటర్న్ టిక్కెట్లు ఇచ్చి స్వదేశానికి పంపడం ద్వారా ఇబ్బందుల్లో వున్నవారి సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారత వలసదారుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం