యూఏఈలో భారత వలసదారులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసిన ఎంబసీ
- May 11, 2019అబుధాబి:యూఏఈలోని ఇండియన్ ఎంబసీ, తమ పౌరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. చేసిన పనికి జీతం దక్కని పక్షంలో, ఎంబసీని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీషుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ ఈ ప్రకటనను విడుదల చేశారు. జీతాలు దక్కని కారణంగా భారతీయ వలసదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి వారు ఎక్కువగా పలు కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్న అధికారులు, ఎంబసీని సంప్రదిస్తే, తగు న్యాయం జరగడానికి చర్యలు తీసుకుంటామనీ, రిటర్న్ టిక్కెట్లు ఇచ్చి స్వదేశానికి పంపడం ద్వారా ఇబ్బందుల్లో వున్నవారి సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారత వలసదారుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన