ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ వినూత్న నిర్ణయం
- May 14, 2019
వన్డే క్రికెట్ ప్రపంచకప్ను అవినీతి రహితంగా నిర్వహించేందుకు ఐసీసీ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని నియమించనుంది. ‘సాధన శిబిరాలు, సన్నాహక మ్యాచ్లు, అసలైన మ్యాచులు ఆడేటప్పుడు వీరు ఆటగాళ్లను గమనిస్తారు. వారితో కలిసే హోటళ్లో ఉంటారు. వారితో కలిసే ప్రయాణాలు చేస్తారు’ అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్నవారిపై, అనుమాస్పదంగా కదులుతున్న వారిపై వీరు కన్నేస్తారు. ఏదైనా జరిగే అవకాశం ఉందా అని పరిశీలిస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగకుండా అవినీతి రహితంగా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









