హీరోగా శ్రీహరి చిన్న కొడుకు
- May 21, 2019
విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు స్వర్గీయ, రియల్ స్టార్, డా. శ్రీహరి.. కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉండగా 49 ఏళ్ళ వయసులో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. తెరమీదే కాదు, తెర వెనక కూడా ఆయన రియల్ స్టారే.. పేదలకు సాయం, గ్రామల దత్తత వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు శ్రీహరి.. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇప్పుడు శ్రీహరి ఇంటినుండి మరో నటుడు తెరంగేట్రం చెయ్యనున్నాడు..
శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన భైరవ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో మేఘాంశ్ నటనకు మంచి స్పందన వచ్చింది. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, నటనకు సంబంధించిన అన్ని రంగాలలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాని కార్తీక్ - అర్జున్ కలిసి డైరెక్ట్ చెయ్యనుండగా, ఈ సినిమాకి 'రాజ్ దూత్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









