హీరోగా శ్రీహరి చిన్న కొడుకు
- May 21, 2019విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు స్వర్గీయ, రియల్ స్టార్, డా. శ్రీహరి.. కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉండగా 49 ఏళ్ళ వయసులో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. తెరమీదే కాదు, తెర వెనక కూడా ఆయన రియల్ స్టారే.. పేదలకు సాయం, గ్రామల దత్తత వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు శ్రీహరి.. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇప్పుడు శ్రీహరి ఇంటినుండి మరో నటుడు తెరంగేట్రం చెయ్యనున్నాడు..
శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన భైరవ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో మేఘాంశ్ నటనకు మంచి స్పందన వచ్చింది. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, నటనకు సంబంధించిన అన్ని రంగాలలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాని కార్తీక్ - అర్జున్ కలిసి డైరెక్ట్ చెయ్యనుండగా, ఈ సినిమాకి 'రాజ్ దూత్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!