కాబూల్లో బాంబు దాడి.. ఇద్దరి మృతి
- May 24, 2019
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ సమీపంలోని పక్టియాకోట్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ప్రార్థనా మందిరంలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మత గురువు ఇమామ్తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అయితే బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీలు ఉంటారు. వీరిలో చాలామంది తాలిబన్లకు అనుకూలంగా ఉంటారు’’ అని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







