8 మంది మృతికి కారణమైన కువైటీ టీనేజ్ డ్రైవర్ అరెస్ట్
- May 29, 2019కువైట్: చిన్న రోడ్డు ప్రమాదం జరగడంతో, అక్కడ గుమికూడి బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపైకి మరో వాహనం వేగంగా దూసుకురావడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కువైట్లో చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. కబాద్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించి, 17 ఏళ్ళ కువైటీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయగా అందులో ముగ్గురు కువైటీలు, ముగ్గురు సౌదీలు ఓ బెడౌన్ మరియు ఇద్దరు ఓ గుర్తు తెలియని వ్యక్తి వున్నారు. పలువురు గాయాల బారిన కూడా పడ్డారు. అరెస్ట్ చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు వుంటాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డుపై ప్రజలు గుమి కూడడడం మంచిది కాదనీ, అదే సమయంలో రోడ్డుపై పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ