700 మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన షార్జా చర్చ్
- May 31, 2019
షార్జా:చర్చిలో పెళ్ళిళ్ళు జరగడం మామూలే. కానీ, ఓ చర్చి ముస్లిం సమాజానికి సంబంధించిన ఈవెంట్ని నిర్వహించడం సాధారణ విషయమైతే కాదు. షార్జాలోని సెంట్ మైఖేల్ చర్చ్ 700 మంది బ్లూ కాలర్డ్ వర్కర్స్కి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన 30 కేథలిక్ వాలంటీర్స్ ఈ ఇఫ్తార్ విందుకు సహాయ సహకారాలు అందించారు. 1971లో ఈ చర్చ ఏర్పాటయ్యింది. 'ఇయర్ ఆఫ్ మెర్సీ'గా ఈ ఏడాదిని పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన దరిమిలా, ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏడు పెద్ద టేబుల్స్ లైన్స్లో కూర్చున్న కార్మికులు, డేట్స్, వాటర్, బిర్యానీతో తమ ఫాస్టింగ్ని ముగించారు. ఆకలికి మతంతో సంబంధం లేదనీ, ప్రేమాభిమానాల విషయంలో మతాల మధ్య తేడాలకు తావు లేదని పరస్పర సహకరమే మానవ జాతికి ఔన్నత్యం కలిగిస్తుందని ఈ సందర్భంగా కార్మికులు, నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







