అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే
- June 02, 2019
వాషింగ్టన్:వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తమ సామాజిక మాధ్యమాల వివరాలు కూడా జత చేసేలా కొత్తనియమాలను తీసుకొచ్చింది. నిజానికి ఈ నియమం గురించి గతేడాదే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రజాభిప్రాయం సేకరించి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియమం ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ఈ నియమం నుంచి ద్వైపాక్షిక, అధికారిక వీసాదార్లకు మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం, విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం తప్పని సరిగా సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే.
కొత్త నిబంధలన ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు సామాజిక మాధ్యమాలను వారు ఏ పేరు మీద ఉపయోగిస్తున్నారో వెల్లడించాలి. దీంతో పాటు ఐదేళ్లపాటు ఈమెయిల్ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందు నిబంధనల ప్రకారం వీసా అభ్యర్థులకు ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ చేపట్టేవారు. ఇప్పుడు నిజమైన అభ్యర్థులను గుర్తించేందుకు సోషల్ మీడియా ఖాతాల ఆధారంగానూ విచారణ చేపడతారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







