అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే
- June 02, 2019
వాషింగ్టన్:వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తమ సామాజిక మాధ్యమాల వివరాలు కూడా జత చేసేలా కొత్తనియమాలను తీసుకొచ్చింది. నిజానికి ఈ నియమం గురించి గతేడాదే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రజాభిప్రాయం సేకరించి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియమం ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ఈ నియమం నుంచి ద్వైపాక్షిక, అధికారిక వీసాదార్లకు మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం, విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం తప్పని సరిగా సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే.
కొత్త నిబంధలన ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు సామాజిక మాధ్యమాలను వారు ఏ పేరు మీద ఉపయోగిస్తున్నారో వెల్లడించాలి. దీంతో పాటు ఐదేళ్లపాటు ఈమెయిల్ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందు నిబంధనల ప్రకారం వీసా అభ్యర్థులకు ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ చేపట్టేవారు. ఇప్పుడు నిజమైన అభ్యర్థులను గుర్తించేందుకు సోషల్ మీడియా ఖాతాల ఆధారంగానూ విచారణ చేపడతారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







