అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా వివరాలు ఇవ్వాల్సిందే
- June 02, 2019వాషింగ్టన్:వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తమ సామాజిక మాధ్యమాల వివరాలు కూడా జత చేసేలా కొత్తనియమాలను తీసుకొచ్చింది. నిజానికి ఈ నియమం గురించి గతేడాదే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రజాభిప్రాయం సేకరించి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ నియమం ఏడాదికి 14.7 మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ఈ నియమం నుంచి ద్వైపాక్షిక, అధికారిక వీసాదార్లకు మినహాయింపు ఉంటుంది. ఉద్యోగం, విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారు మాత్రం తప్పని సరిగా సోషల్ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే.
కొత్త నిబంధలన ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు సామాజిక మాధ్యమాలను వారు ఏ పేరు మీద ఉపయోగిస్తున్నారో వెల్లడించాలి. దీంతో పాటు ఐదేళ్లపాటు ఈమెయిల్ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంతకు ముందు నిబంధనల ప్రకారం వీసా అభ్యర్థులకు ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ చేపట్టేవారు. ఇప్పుడు నిజమైన అభ్యర్థులను గుర్తించేందుకు సోషల్ మీడియా ఖాతాల ఆధారంగానూ విచారణ చేపడతారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు