'భారత్' సినిమా రిలీజ్ పై ఉత్కంఠ
- June 03, 2019న్యూఢిల్లీ:బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తక్షణం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. దేశం పేరుతో రూపొందిన ఈ సినిమా దేశ సాంస్కృతిక, రాజకీయ ప్రతిష్టను మసకబార్చేలా ఉందన్న పిటిషనర్ ఆరోపణలపై విచారణకు హైకోర్టు ముందుకొచ్చింది.
జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తమ పిటిషన్పై సత్వరమే విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వినతిని జస్టిస్ జేఆర్ మిధా, జస్టిస్ చందర్శేఖర్లతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరిస్తూ దీనిపై ఈరోజే విచారిస్తామని పేర్కొంది. ఎంబ్లమ్స్, నేమ్స్ చట్టం ప్రకారం భారత్ పేరును ఎలాంటి వ్యాపారం, వర్తకం, వృత్తి లేదా ట్రేడ్మార్క్, పేటెంట్లాగా వాడుకోవడం నిషిద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం 'భారత్' దేశ అధికారిక నామమని, ఈ పేరుతో సినిమా టైటిల్ సరైంది కాదని పిటిషనర్ వికాస్ త్యాగి నివేదించారు. సినిమా విడుదలపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం