ఈజిప్టులో ఉగ్రదాడి..

- June 05, 2019 , by Maagulf
ఈజిప్టులో ఉగ్రదాడి..

ఈజిప్ట్‌:సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద బుధవారం ఇస్లామిక్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. రంజాన్‌ సందర్భంగా ఈల్ అరీష్‌ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ రోజు ఉదయం చెక్‌ పాయింట్‌ వద్ద ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధరించారు.

ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. చెక్‌ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు తెలిపారు. ఉత్తర సినాయీ ఆధారిత ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో ఈజిప్ట్ బలగాలు కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com