మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్
- June 07, 2019
ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వం. యోగా గురు బాబా రాందేవ్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిస్తుంటారు ఆయన. ప్రధాని యోగా గురుగా మారి పోయి ట్విట్టర్లో ఓ వీడియోని షేర్ చేశారు.
యానిమేషన్ రూపంలో కనిపిస్తున్న ఆయన తాడాసనం ఎలా వెయ్యాలో చెబుతూ.. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగాపై అందరికీ ఆసక్తి కలిగేలా ఈ వీడియోని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీన్ని 37 వేల మంది లైక్ చేయగా.. 7 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. మోదీ యానిమేషన్ వీడియోల కోసం ప్రత్యేక ఐటీ అధికారుల టీమ్ పనిచేస్తోంది. తాజా వీడియోలో ఉన్న తాడాసనం ప్రధాని రోజూ చేసే యాగాసనాల్లో ఒకటి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







