మోదీ యోగా పాఠాలు.. వీడియో వైరల్
- June 07, 2019
ఆరోగ్యం అందరికీ చాలా అవసరం.. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. ప్రతి రోజూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంటారు ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ. జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తింపు తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వం. యోగా గురు బాబా రాందేవ్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిస్తుంటారు ఆయన. ప్రధాని యోగా గురుగా మారి పోయి ట్విట్టర్లో ఓ వీడియోని షేర్ చేశారు.
యానిమేషన్ రూపంలో కనిపిస్తున్న ఆయన తాడాసనం ఎలా వెయ్యాలో చెబుతూ.. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగాపై అందరికీ ఆసక్తి కలిగేలా ఈ వీడియోని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీన్ని 37 వేల మంది లైక్ చేయగా.. 7 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. మోదీ యానిమేషన్ వీడియోల కోసం ప్రత్యేక ఐటీ అధికారుల టీమ్ పనిచేస్తోంది. తాజా వీడియోలో ఉన్న తాడాసనం ప్రధాని రోజూ చేసే యాగాసనాల్లో ఒకటి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







