రాజు సుందరం డైరెక్షన్లో శర్వా
- June 10, 2019
సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం త్వరలోనే దర్శకత్వం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పదేళ్లకు ముందే ఈయన దర్శకుడిగా `నీవల్లే నీవల్లే` సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత కొరియోగ్రాఫర్గానే బిజీగా మారిపోయారు. అయితే మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టాలనుకుని ఓ కథను సిద్ధం చేసుకున్నారు.
రీసెంట్గా శర్వానంద్ను కలిసి లైన్ చెప్పారట. పూర్తి స్క్రిప్ట్తో వస్తే అప్పుడు ఆలోచిస్తానని శర్వా చెప్పడంతో రాజు సుందరం స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో, లేక వచ్చే ఏడాదో శర్వానంద్, రాజు సుందరం కలయికలో సినిమా సెట్స్కు వెళుతుంది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







