కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు
- June 10, 2019
భారత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూకాశ్మీర్ కథువా బాలిక రేప్ కేసులో పటాన్ కోట్ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. 2018 జనవరిలో 8ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో 16 నెలల తర్వాత తీర్పు వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దోషుల్లో మాజీ ప్రభుత్వ ఉద్యోగి సాంజీ రామ్ ఉన్నాడు. ఈ దారుణం వెనుక మాస్టర్ మైండ్ అతడే అని పోలీసులు భావిస్తున్నారు. దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటలకు కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది.
8ఏళ్ల ముస్లిం బాలికను.. కిడ్నాప్ చేసి కథువా సమీపంలోని గ్రామ ఆలయంలో నిర్బంధించారు. బాలికను చిత్రహింసలు పెట్టారు. డ్రగ్స్ ఇచ్చారు. తిండి పెట్టకుండా వేధించారు. రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు. చివరికి రాయితో తలమీద కొట్టి ఆ పాపను చంపేశారు. బాలికను దేవాలయంలో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడి 22ఏళ్ల కొడుకు కూడా నిందితుడే అంటున్నారు. జూన్ 3తో ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయ్యింది. దీంతో సోమవారం (జూన్ 10,2019) న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. నిందితులకు ఉరి శిక్ష విధించాలని బాధిత కుటుంబంతో పాటు యావత్ భారత దేశం కోరుకుంటోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







