సెప్టెంబర్ 15 నుంచి ఢిల్లీ-చైనా మధ్య ఇండిగో విమానం...
- June 12, 2019
న్యూఢిల్లీ:తక్కువ ధరకు ఢిల్లీ-చైనాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ముందుకు వచ్చింది. ఢిల్లీ-చెంగ్డుల మధ్య సెప్టెంబర్ 15 నుంచి ప్రతి రోజూ నాన్-స్టాప్ విమానాలను నడపనున్నట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియం బౌల్టర్ తెలిపారు. ఇది ఇండిగో చరిత్రలో మరో కీలక ఘట్టం అని ఆయన వ్యాఖ్యానించారు. చైనా విమానయాన మార్కెట్లోని ఇండిగో ప్రవేశం వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విమానయానానికి సంబంధించి రావాల్సిన అనుమతులు లభించగానే ఢిల్లీ-చెంగ్డుల మధ్య విమానాల రాకపోకలకు టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో ఇండిగో ముందడుగు వేస్తున్నదన్నారు. ఇక దేశంలోని డొమిస్టిక్ విమానాల్లో ప్రయాణికులకు అత్యధిక సేవలందిస్తున్నామని, డొమిస్టిక్ ప్రయాణికుల్లో 50 శాతం మంది ఇండిగో ప్రయాణికులే ఉన్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..