తెలంగాణలో జూడాల ఆందోళన
- June 17, 2019
హైదరాబాద్: కోల్కత్తాలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనకు తెలంగాణ వైద్యులు మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓపి సేవలను నిలిపివేసి నిరసన చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అత్యవసర సేవల మినహా ఓపి సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియాకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సేవలందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండ్ నాగేందర్ తెలిపారు.
మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







