చైనాలో భూకంపం 12 మంది మృతి...
- June 18, 2019
చైనాలో సియాచిన్ ప్రావిన్స్లో గత అర్థరాత్రీ రెండు భూమి కంపించింది. ఈ భూకంపంలో 12 మంది మృత్యువాత పడగా వంద మందికి పైగా గాయలపాలయ్యారు. చైనాలోని మెట్రో పోలీస్ , మరియు చెంగ్డూ ప్రాంతాల్లో భూకంప ప్రభావం కంపించింది. దీంతో ప్రజలు అర్ధరాత్రీ పూట ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. భూకంప ప్రభావం సమాచారం అందుకున్న విపత్తు నివారణ సంస్థలు అక్కడికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. పలు బిల్డింగ్ల క్రింద సజీవంగా ఉన్న వారిని కాపాడారు. ఈనేపథ్యంలోనే 122 మంది గాయపడ్డారని తెలిపారు. దీంతో గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించాయి.
ఇక భూకంపం వచ్చిన ప్రాంతం గ్రామీణ ప్రాంతం కావడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.ఇక భూకంపం జరిగిన దృశ్యాలను సైతం అక్కడి స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. దీంతో భాదితులను ఆధుకునేందుకు సహయచర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు రిక్టర్ స్కేల్పై 5.9 గా భూకంపం తీవ్రత నమోదైనట్టు, దాని ప్రభావం భూకంప కేంద్రం నుండి దాదాపు 10 కి.లో మేర పడినట్టు అధికారులు తెలిపారు.ఇక 2008లో సిచువాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల సుమారు 70 మంది ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం







