4 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మృతి

- June 20, 2019 , by Maagulf
4 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మృతి

బహ్రెయిన్: 2019 తొలి నాలుగు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 22 మందిని బలి తీసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌తో కలిసి ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. మార్చి నెలలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. మొత్తం ఏడుగురు ఈ నెలలో ప్రాణాలు కోల్పోయారు. జవనరి నెలలో ఆరుగురు, ఫిబ్రవరి నెలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏప్రిల్‌లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మొత్తం 132 మంది డ్రైవర్స్‌కి తీవ్ర గాయాలు కాగా, 134 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. లైసెన్స్‌డ్‌ వాహనాల సంఖ్య తొలి నాలుగు నెలల్లో 5000 వరకు పెరిగాయి. మొత్తం వాహనాల సంఖ్య 725,589కి చేరుకుంది ఏప్రిల్‌ నాటికి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com