సలాలాను సందర్శించే టూరిస్టులకు సేఫ్టీ గైడ్ లైన్స్
- June 27, 2019
మస్కట్: వేలాది మంది దోఫార్ గవర్నరేట్ని ఖరీఫ్ సీజన్లో సందర్శించడం జరుగుతుంటుంది. వేసవి తీవ్రతను తప్పించుకునేందుకు ఈ టూర్స్ వారికి ఎంతగానో ఉపయోగపడ్తాయి. ఇదిలా వుంటే, పెద్దయెత్తున దోఫార్ గవర్నరేట్కి వచ్చే ఖరీఫ్ టూరిస్టుల కోసం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. వాహనాల్ని పరిమిత వేగంతో నడపాలనీ, ట్రాఫిక్ లైట్స్ని ఖచ్చితంగా వినియోగించాలని మినిస్ట్రీ తమ గైడ్ లైన్స్లో పేర్కొంది. రోడ్డుపై జంతువులు క్రాస్ చేసే అవకాశం వున్నందున అప్రమత్తంగా వుండాలనీ, వాటికి ఎలాంటి హానీ కలిగించవద్దని మినిస్ట్రీ సూచించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో తప్ప వాహనాల్ని ఎక్కడబడితే అక్కడ నిలుపకూడదు. లూసెన్స్ పొందిన క్రూయిజ్లను మాత్రమే వినియోగించాల్సి వుంటుంది. ఫోర్ వీల్ డ్రైవ్స్ని మాత్రమే ఉపయోగించాలనీ, తగినంత ఆహారం, మంచి నీళ్ళు, ఫ్యూయల్ అలాగే స్పేర్ టైర్ తప్పనిసరని గైడ్లైన్స్లో మినిస్ట్రీ పేర్కొంది. మరీ ముఖ్యంగా ప్రత్యేక వాహనాల్లో వెళ్ళేవారు తమ ఫోర్ వీల్ డ్రైవ్ కండిషన్ని పరిశీలించుకుని, అవసరమైన మరమ్మత్తులు ముందే చేయించుకోవాలి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







