టెలికామ్ టవర్పై అస్వస్థతకు గురైన కార్మికుడ్ని రక్షించిన అధికారులు
- June 27, 2019
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ వర్కర్ ఒకరు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ టవర్పై అస్వస్థతకు గురవగా, అతన్ని అత్యంత చాకచక్యంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) టీమ్ రక్షించింది. ముదైబిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎసిడిఎ వర్గాలు ఈ ఘటన గురించి వెల్లడిస్తూ కార్మికుడ్ని క్షేమంగా కిందికి దించామనీ, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పడం జరిగింది. అల్ షర్కియా గవర్నరేట్ పరిధికి చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ - రెస్క్యూ అలాగే అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పిఎసిడిఎ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కార్మికుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









