టెలికామ్ టవర్పై అస్వస్థతకు గురైన కార్మికుడ్ని రక్షించిన అధికారులు
- June 27, 2019
మస్కట్: టెలికమ్యూనికేషన్స్ వర్కర్ ఒకరు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ టవర్పై అస్వస్థతకు గురవగా, అతన్ని అత్యంత చాకచక్యంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) టీమ్ రక్షించింది. ముదైబిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎసిడిఎ వర్గాలు ఈ ఘటన గురించి వెల్లడిస్తూ కార్మికుడ్ని క్షేమంగా కిందికి దించామనీ, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పడం జరిగింది. అల్ షర్కియా గవర్నరేట్ పరిధికి చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ - రెస్క్యూ అలాగే అంబులెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పిఎసిడిఎ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కార్మికుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







