కాబూల్:బాంబు పేలుళ్లు 16 మంది మృతి...
- July 01, 2019
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. తాలిబాన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. అమెరికా ఎంబసీకి సమీపంలో కారు బాంబుతో పేలుళ్లకు తెగబడ్డారు. ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 16మంది చనిపోయారు. 100మందికి పైగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చారు.
బాంబు పేలుళ్లతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ లో నిత్యం బాంబు దాడులు జరుగుతుంటాయి. ముష్కరమూకలు రక్తపుటేరులు పారిస్తుంటాయి. భద్రతా దళాలే లక్ష్యంగా అటాక్స్ చేస్తుంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టిస్తుంటారు.
జనాలు ఎక్కువగా ఉన్న చోట ఉగ్రవాదులు బాంబు పేల్చారు. గాయపడిన వారిలో 50మంది పిల్లలు ఉన్నారు. వారంతా స్కూల్ పిల్లలే. బాంబు బ్లాస్ట్ కి స్కూల్ భవనం అద్దాలు ముక్కలయ్యాయి. అవి పిల్లలపై పడ్డాయి. బాంబు బ్లాస్ట్ సమయంలో పిల్లలు క్లాస్ రూమ్స్ లో ఉన్నారు. గాయపడిన పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాబూల్ లో తరుచుగా జరుగుతున్న బాంబు పేలుళ్లకు పిల్లలు బలవుతున్నారు. పిల్లలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఆఫ్ఘనిస్తాన్ తయారైంది. అంతర్గత ఘర్షణల కారణంగా అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 20 ఏళ్లుగా ఆప్ఘనిస్తాన్.. అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







